Home » New Delhi
దేశ రాజధాని హస్తినలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కీర్తినగర్ లోని ఫర్నిచర్ మార్కెట్ బ్లాక్-2లో అగ్నిప్రమాదం చెలరేగి మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో 17 అగ్నిమాక శకటాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి.
అదానీ గ్రూప్పై మళ్లీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని, ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని అన్నారు.
ఒకప్పుడు మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బిడ్డల్ని మోసి కనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు బెయిల్ రద్దు చేయడానికి సుప్రీం నిరాకరించింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊహించని రీతిలో షాక్ తగిలినట్లయ్యింది. జగత్ జనని చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాలు ఆరోపణలతో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను సీఐడీ అరెస్ట్ చేసింది.
వాయు నాణ్యత ఇండెక్స్(Air Quality Index) లో ఇన్నాళ్లు ఢిల్లీ మీదున్న ఓ రికార్డు ఇప్పుడు ముంబయి బ్రేక్ చేసింది. ముంబయిలో దేశ రాజధానికంటే అధ్వానమైన పరిస్థితి నెలకొందరి ఓ రిసర్చ్ వెల్లడించింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) నివేదిక ప్రకారం.. ముంబయి(Mumbai)లో గాలి నాణ్యత మోడరేట్ కేటగిరీకి పడిపోయింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు తప్పు అని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు.
'ఆపరేషన్ అజయ్' విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కింద నడుపుతున్న నాలుగో ఫ్లైట్లో ఇజ్రాయెల్లో చిక్కుకున్న చిక్కుకున్న 274 మంది భారతీయులు ఆదివారంనాడు సురక్షితంగా న్యూఢిల్లీ చేరుకున్నారు. వీరికి కేంద్ర సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం పలికారు.
హర్యానాలోని ఫరీదాబాద్లో ఆదివారం మధ్యాహ్నం 4.08 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్సోలజీ తెలిపింది. ఫరీదాబాద్ ఈస్ట్కు తొమ్మిది కిలోమీటర్లు, ఆగ్నేయ ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్టు పేర్కొంది.
కోర్టులో అప్రస్తుత ప్రసంగం చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ పై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ను శనివారంనాడు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజకీయ ప్రసంగాలు చేయవద్దని కోర్టు హెచ్చరించింది.
ఇజ్రాయెల్-హమాస్(Israeil-Hamas) మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన 447 మంది భారతీయులను(Indians) 'ఆపరేషన్ అజయ్'(Operation Ajay) కింద తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి.